కవిత : మనం బిగించే పిడికిలిలో దోపిడీ వ్యవస్థ నలిగిపోవాలి…

తుఫాను సమయంలో వీచే గాలిలా…
వరదల సమయంలో జర జర పారే నదిలా…
యుద్ధం సమయంలో పరుగులు తీసే సైనికుడిలా…

ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన నిర్వహిస్తున్న కవాతుకు సిద్ధమవ్వండి జనసైనికులారా?


ఈ తరంలో జరుగుతున్న సమరం వచ్చే తరాల జీవితాలకు బాసటగా నిలవాలి..
ఆంధ్ర రాష్ట్రంలో గల భూమిని ఎవడైనా కాజెయ్యాలంటే వాడికి గుండెల్లో వణుకు పుట్టాలి…
అన్యాయం చేసిన కేంద్రం మనకి సలాం కొట్టేలా చెయ్యాలి…
మట్టి, ఇసుక కోసం ఆరాటపడే వారి బతుకులు హూనం అయ్యేలా కొట్టాలి…

మనం వేసే అడుగు అవినీతిని అంతం చెయ్యాలి…
మనం బిగించే పిడికిలిలో దోపిడీ వ్యవస్థ నలిగిపోవాలి…

మన కోసం కళ్యాణ్ గారు ముందు అడుగు వేశారు. ఆ అడుగులను అనుసరిస్తూ సైన్యంలా దూసుకుపోదాం..

By unswamy

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *